ఎన్నికల (Elections) బరిలో నిలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. గత ఎన్నికలతో పోలిస్తే పోటీలో ఉన్న ఇండిపెండెంట్ల సంఖ్య పెరిగింది. ఓట్లు రాకున్నా బరిలో నిలిచేందుకు ఇండిపెండెంట్లు ఆసక్తి చూపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ దఫా మొత్తం 66 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. హైద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 30 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 09 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ స్థానంలో ఎంఐఎంను ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. పాతబస్తీపై బీజేపీ కేంద్రీకరించింది.
సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి 45 మంది బరిలో నిలిచారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. గత ఎన్నికల్లో 15 మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి 43 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. 2019లో ఇదే స్థానం నుండి ఐదుగురు మాత్రమే పోటీ చేశారు. చేవేళ్ల స్థానం నుండి 22 మంది బరిలో నిలిచారు. ఇందులో 11 మంది ఇండిపెండెట్లు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి 8 మంది పోటీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇండిపెండెంట్లు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు నామమాత్రంగానే ఓట్లు పోలయ్యాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు చీల్చిన ఓట్లు ప్రధాన పార్టీల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండిపెండెంట్లకు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 500 ఓట్లు కూడా రాలేదు. హైద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసిన స్వతంత్రులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…