పశ్చిమాసియాలో భీకర యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో భారత్కు భారీ ఊరట లభించింది. రష్యా ముడి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాత్కాలికంగా 30 రోజుల పాటు రష్యా ఆయిల్ కొనేందుకు భారత్కు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ఆంక్షలు సడలిస్తున్నామని..ఇరాన్ చర్యల వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అన్న బెసెంట్.. భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
#cvrtelugu
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గజ గజ వణికిస్తున్నచలి రాత్రి సమయాల్లో ప్రజలు బయటికి రాలేనంత చలి భయపెడుతోంది . మధ్యాహ్నసమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముందు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 దాటినా కొన్ని చాలా ప్రాంతాల్లో మంచు తో చలి తగ్గడం లేదు. మంచు కురవడం వలన రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు రోడ్లు కనిపించడం లేదు.తెలంగాణలో వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లోనూ చలి ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. కొన్ని నగరాల్లో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
- Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 74853