మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పవన్ బిజిగా ఉన్నారు. ఈ సినిమాను జనవరి వరకూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మార్చి 28న విడుదల అని రిలీజ్ డేట్ కూడా వేశారు. అయితే ఇదే డేట్ కు ఒక్క రోజు ముందుగా 27న మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే ‘ఎంపూరన్’. మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సారి మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. లూసీఫర్ ను తెలుగులో మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు. కానీ మళయాలం అంత హిట్ కాదు ఇక్కడ. ఈ సారి రీమేక్ కు ఛాన్స్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారీ చిత్రాన్ని.
హరిహర వీరమల్లును కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. పవన్ కు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇలాంటి మూవీతో మోహన్ లాల్ పోటీ పడబోతున్నాడు. అంటే.. ఇతర భాషల్లో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి