వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం ఎదురు చూస్తున్నారు . కానీ ఆర్జీవీ మాత్రం ఇంత వరకూ కనిపించడం లేదు . ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ను కించపరిచేలా పోస్ట్లు పెట్టారని మద్దిపాడు పీఎస్లో ఆర్జీవీపై కేసు నమోదయింది. రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడం తో పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు హాజరుకాకపోతే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. దానికి తగ్గట్లే ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. విచారణకు హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ చేస్తామని ఆర్జీవీకి పోలీసులు స్పష్టం చేసారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
- Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్ బ్రిక్స్ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్దళ్ కార్యకర్తలు పోలీసులకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 74839