వరంగల్ జిల్లాకు చెందిన రితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నారు. రితేశ్వరి తల్లిదండ్రులు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.
ర్యాగింగ్, వేధింపుల కారణంగా 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తాను ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. గుంటూరు కోర్టులో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగా.. కోర్టు తీర్పు వెలువరించింది.
రిషితేశ్వరి కేసుపై న్యాయస్థానం తీర్పు తర్వాత బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమో ఆవేదన వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 33633