గత ప్రభుత్వ హయాంలో సీఐడీని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించారు. ఇప్పుడాయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అవినీతి చర్యల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంజయ్ ఇంతకుముదు ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో కోటి రూపాయల మేర దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది.
సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్… ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే ఆయన సస్పెండ్ అయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 74516