మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహరాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. జార్ఖండ్లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 186 పోలింగ్ బూత్లు, 29వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 13న నోటిఫికేషన్, 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని రాజీవ్ కుమార్ తెలిపారు. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఉగ్రవాదులకు, ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదులు స్వీకరించడానికి సీ-విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 38438