పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు… సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీష్ ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్తాన్ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు. 1960లో మంచి ఉద్దేశంతో ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, గత ఏడాది జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ దీనిని నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టినప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ ఈ అంశంపై అక్కసు వెళ్లగక్కింది. అయితే భారత్ కూడా అదే స్థాయిలో దాయాదికి దీటుగా జవాబిచ్చింది.
#pak
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే కొత్త రేట్లను వసూలు చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలు పెంచింది. ప్రకటన వెలువడిన వెంటనే వ్యాపారులు నూడుల్స్, టూత్పేస్ట్, బిస్కెట్లు, స్థానికంగా తయారైన చాక్లెట్లు వంటి రోజువారీ వస్తువుల ధరలను పెంచేశారు. చిన్న వస్తువులు కొనడానికి దుకాణానికి వెళితే, ప్రతీ వస్తువుపై 10 రూపాయలు పెంచారని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. ఈ ఆరోపణలపై వ్యాపారులు స్పందిస్తూ.. రవాణా, పంపిణీ ఖర్చులు పెరగడం వల్లే ధరలను సర్దుబాటు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడు తాము నష్టపోతాం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని ఆబ్పారా మార్కెట్లోని ఓ దుకాణదారుడు గులాం ఉల్లా తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. హోల్సేల్ డీలర్లు, రవాణాదారులు ధరలు పెంచడంతో పప్పుధాన్యాల ధర కిలోకు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగిందని రావల్పిండి అసోసియేషన్ ఛైర్మన్ సలీం పర్వేజ్ బట్ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని…బిజినెస్ రికార్డర్ నివేదిక తెలిపింది. దీని ప్రభావంతో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పాకిస్థాన్పై తీవ్ర భారం పడుతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపై మోపింది. ప్రస్తుతం లీటర్పై పెంచిన 55 రూపాయలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కూరగాయల సరఫరా సరిపడా ఉన్నప్పటికీ, టమాటా, మిర్చి వంటి వాటి ధరలు కూడా మార్కెట్లలో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి హోల్సేల్ మార్కెట్, కమిషన్ ఏజెంట్లే కారణమని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు.




Total views : 78964