కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. పలువురు ప్రముఖుల ఇండ్లకు రోడ్ల విస్తరణ కోసం అధికారులు మార్కింగ్ ప్రక్రియను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనుతలో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.
కేబీఆర్ పార్కు జాతీయ ఉద్యానవనం హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ ఎస్.ఆర్.డీ.పీ. పేరుతో 2016 కేబీఆర్ పార్కు చుట్టూ పైవంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించగా ఆయా పైవంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్ లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్ర సేన్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45, చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో 1,200 కోట్లతో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్ పాస్ లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి