వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెన మరమ్మత్తు పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. గోదావరిపై ఉన్న వంతెనకు గత సుమారు పది నెలలుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి.మరో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి…
- ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ విచారణ.ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వందల కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతితో కీలక నిందితులైన ఏపీ బేవరేజెస్…
- చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని, నగదు జమ చేసినప్పటికీ ఇళ్లు రాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అర్హత ఉండి గృహాలు దక్కని లబ్ధిదారులకు, వారు చెల్లించిన నగదును…





Total views : 214639