ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తానంటూ ఆయన పేషీకి మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. పవన్ను చంపేస్తానంటూ అతను బెదిరింపులకు దిగాడు. ఉప ముఖ్యమంత్రిని అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ పలు మెసేజ్లు పంపించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బెదిరింపులకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియగా.. ఆమె వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. నిందితుడి ఫోన్ నంబర్ సహా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే అగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడని, పలు మెసేజ్లు పంపించాడని హోంమంత్రి అనితకు డీజీపీ తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని అనిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగాయి. నిందితుడి కాల్స్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ సిగ్నల్స్ విజయవాడ లబ్బిపేట నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ నంబర్ మల్లికార్జున్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్లికార్జున్ ఎవరు, ఎందుకు బెదిరింపులకు దిగాడు, అతని వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరు చేప్తే చేశాడు వంటి విషయాలు విచారణలో తెలియనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి