ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్పై జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి. ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. జాతీయ మెడికల్ కమిషన్కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే, యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించారు. గ్రూప్ దశలో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్లో, టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు.‘‘శ్రమించేతత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం. విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరింది. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా. జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీసులనే అని ఆయన గుర్తుచేశారు. రిట్రీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనడమేనని సీఎం తెలిపారు. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో ఎక్కడికి చేరుకోవాలో స్పష్టత వస్తుందని అన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషించుకుని వాటికి తగిన పరిష్కారాలపై చర్చించామని వివరించారు. సమస్యలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్ కాగా, మరొకటి అడాప్టివ్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలను వనరులు మరియు సమయం కేటాయిస్తే పరిష్కరించవచ్చని తెలిపారు. అయితే అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో సమస్య యొక్క అసలు కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేకుండా ముందుకు సాగేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” అనే పాలసీ డాక్యుమెంట్ను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2100 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాల పరిస్థితులను కూడా సీఎం ఉదాహరణగా ప్రస్తావించారు. ఢిల్లీ నగరం కాలుష్య సమస్యతో బాధపడుతుండగా, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ముంబై, చెన్నై నగరాలు వరదల సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీసింగ్ వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం పెద్ద సమస్యగా ఉండేదని, దాన్ని ఎదుర్కొనేందుకు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఫిజికల్ క్రైమ్ నియంత్రణ కోసం ఇప్పటివరకు పలు వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం నేరాల స్వరూపం మారిందని తెలిపారు.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను కూడా సాంకేతికంగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారులను నియమించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న సిబ్బందికి కూడా నూతన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో సిబ్బంది మరియు అధికారులను నిరంతరం అప్డేట్ చేయకపోతే నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ రిట్రీట్ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్ తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందని తెలిపారు.
ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. కడప లోక్సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వాహన శ్రేణిని నస్రుల్లాబాద్ మండల కేంద్రం సమీపం లోని గండి వద్ద ఏర్పాటు చేసిన చెకింగ్ పాయంట్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు.ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేయాలని కోరిన పోలీసు సిబ్బందికి మీ డ్యూటీ మీరు చేసుకోండని తెలిపి సహకరించిన పోచారం గారు.పోచారం గారి వాహనంతో పాటు వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పూర్తిగా చెక్ చేసిన పోలీసులు. తమకు పూర్తి స్థాయిలో సహకరించిన పోచారం గారికి ధన్యవాదాలు తెలిపిన పోలీసు సిబ్బంది.





Total views : 78934