తిరుమలలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 6న ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆలయ వ్యవహారాలపై సమగ్ర అవగాహన పెంచుకున్నట్లు ఆయన తెలిపారు.సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలనలు నిర్వహిస్తానని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా, సౌకర్యవంతమైన దర్శనం అందేలా, అలాగే నాణ్యమైన ప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా టీటీడీ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
#ttdtemple
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3 నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య జారీ చేయనున్నారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందించనున్నారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని మార్గదర్వకాలు విడుదల చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
- ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…
- మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ..చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్ లో జరిగిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది. దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది. సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులూ ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
వైసీపీ హయాంలో వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సెల్ఫ్ సిఫారసు లేఖలను టీటీడీ సమర్పించి… తమవెంట 50 నుంచి 100 మందిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీనిని కట్టడి చేస్తే… శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యభక్తులకు అదనంగా మరో గంట సమయాన్ని అందుబాటులోకి తేవొచ్చని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు ప్రతినెలా ఖాళీగా ఉన్న ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసి డిప్ ద్వారా టీటీడీ కేటాయిస్తుంది. ఒక్కసారి ఆర్జితసేవ టికెట్ పొందిన భక్తుడికి మళ్లీ మూడు నెలల తర్వాతే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలా సామాన్య భక్తులకు ఒక రీతి… వీఐపీలకు మరో రీతి ఉండటంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
- ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…
- మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ..చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్ లో జరిగిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 69915