తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల హాల్ టికెట్లను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు TGPSC అధికారిక ప్రకటన జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 15 వ తేదీన పేపర్ 1, పాపేర్ 3… 16 వ తేదీన పేపర్ 2, పేపర్ 4 నిర్వహిస్తున్నారు. హాల్టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TGPSC తాజా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీకి గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన గత ప్రభుత్వం జారీ చేసింది.
2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్. దీనిపై స్పదించని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటుంది.
అభ్యర్థుల బాధను పట్టించుకోకుండా మొండి వైఖరితో పరీక్షలు నిర్వహిస్తుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి