ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తానంటూ ఆయన పేషీకి మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. పవన్ను చంపేస్తానంటూ అతను బెదిరింపులకు దిగాడు. ఉప ముఖ్యమంత్రిని అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ పలు మెసేజ్లు పంపించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బెదిరింపులకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియగా.. ఆమె వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. నిందితుడి ఫోన్ నంబర్ సహా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే అగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడని, పలు మెసేజ్లు పంపించాడని హోంమంత్రి అనితకు డీజీపీ తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని అనిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగాయి. నిందితుడి కాల్స్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ సిగ్నల్స్ విజయవాడ లబ్బిపేట నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ నంబర్ మల్లికార్జున్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్లికార్జున్ ఎవరు, ఎందుకు బెదిరింపులకు దిగాడు, అతని వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరు చేప్తే చేశాడు వంటి విషయాలు విచారణలో తెలియనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199105