సీఎం జగన్(CM Jagan) పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ సునీతా(YS Sunita) జగన్పై సంచలన వ్యాఖ్యల చేశారు. ఎక్కువ రోజుల పాటు తలకు బ్యాండేజీ ఉంటే సెప్టిక్ అవుతుందని సెటైర్లు వేశారు. జగన్కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదేమో.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీసేయాలంటూ ఓ వైద్యురాలిగా సలహా ఇస్తున్నానంటూ చురకలంటించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బదులిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డిపై సీఎంకు ద్వేషం ఉందన్నారు. హత్యపై మాట్లాడొద్దని చెప్పి కోర్టుకు వెళ్లిన వారి అదే హత్యపై మళ్లీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే నన్ను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని సునీత ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెన మరమ్మత్తు పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. గోదావరిపై ఉన్న వంతెనకు గత సుమారు పది నెలలుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి.మరో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి…
- ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ విచారణ.ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వందల కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతితో కీలక నిందితులైన ఏపీ బేవరేజెస్…
- చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని, నగదు జమ చేసినప్పటికీ ఇళ్లు రాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అర్హత ఉండి గృహాలు దక్కని లబ్ధిదారులకు, వారు చెల్లించిన నగదును…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 214639