Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh నేడు షెడ్యూల్ విడుదల చేసిన తలశిల రఘురాం..

నేడు షెడ్యూల్ విడుదల చేసిన తలశిల రఘురాం..

by Satya
Talashila Raghuram schedule released

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు(YSRCP President), ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Bus Yatra) ఇవాళ్టి షెడ్యూల్(Schedule) ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ విశాఖలోని ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వద్ద సోషల్‌ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇది చదవండి: ఎంతమందితో పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగనే..!

అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్‌ చేరుకుంటారని రఘురాం తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
    ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

023326
Total views : 141763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.