ముంబైలో జరిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హస్తినకు చేరుకున్నారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు పైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో కృత్రిమ మేధ వినియోగంపై చర్చలు జరిగాయి. కాగా, హైదరాబాద్ ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ పర్యటన అత్యంత కీలకం. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
Telangana
వరంగల్ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది.తొలుత ఒకరికి లీక్ చేసిన తర్వాత ఎంతమందికి చేరిందో ఆరా తీసారు.విచారణలో గత ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు.25-26 విద్యా సంవత్సరం థర్డ్ ఇయర్ ప్రశ్న పత్రాలు వరంగల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి లీక్ అయ్యాయి. సెల్ఫోన్లో ఫోటోలు తీసి విద్యార్థులకు జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ పంపించి జ్యోతి అనే ఇన్ సర్వీస్ విద్యార్థికి ప్రశ్నాపత్రాలు పంపి డబ్బులు వసూలుచేసినట్లు సమాచారం..జ్యోతి ద్వారా అశ్వరావుపేట వ్యవసాయ కాలేజీకి చెందిన బేబీ శాలిని, దుర్గారావులకు…అశ్వరావుపేట విద్యార్థుల నుంచి జగిత్యాల వ్యవసాయ కాలేజ్ విద్యార్థులు శ్రీనివాస్, రమేష్ లకు ప్రశ్నాపత్రాలు చేరాయి. ఇన్ సర్వీస్ విద్యార్థులు చైన్ సిస్టం ద్వారా వరంగల్, జగిత్యాల, పాలెం, అదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలోని ఇన్ సర్వీస్ విద్యార్థులకు చేరుతుండగా ప్రశ్న పత్రాల లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిఐడీ అధికారులు గుర్తించారు.దీనితో గత 5ఏళ్లుగా పాస్ అయిన ఇన్ సర్వీస్ విద్యార్థుల డిటైల్స్, వ్యవసాయ కళాశాలల్లోని జూనియర్ అసిస్టెంట్ల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ క్యాతన్పల్లి లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. రౌడీయిజం, గూండాయిజాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి వివేక్ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే సుమన్ చేసిన ఆరోపణలకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. బాల్క సుమన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండటంతో మేము ఉదయం 11 గంటలకే కౌన్సిల్ హాలుకు చేరుకున్నామని అన్నారు. కానీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మధ్యాహ్నం 12 గంటలకు రావడంతో కోరం లేనందున ఎన్నిక వాయిదా పడిందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు, క్యాతన్పల్లిలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. అప్పట్లో నామినేషన్లు వేసిన వారిని బాల్క సుమన్ వేధించి, బలవంతంగా విత్డ్రా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తాము ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నా సుమన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వివేక్ ధ్వజమెత్తారు
తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని, మధ్యాహ్నం 12.05 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్టయ్యారు. 12 RDX బాంబులను కోర్టుల్లో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో ఆయా కోర్టుల నుంచి బడ్జిలు, న్యాయవాదులు, పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి, బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా ? లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి, ఎవరు పంపారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.
ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. విద్యార్థులు, యువతీ, యువకులు సీఎం కప్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
హైదరాబాద్ మణికొండలో మంజీరా పైప్లైన్ బ్లాస్ట్ అయింది. దీంతో భారీగా నీరు స్థానికంగా ఉన్న ఇళ్లలోకి చేరింది. రెండు అపార్ట్మెంట్ల సెల్లార్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. విషయం తెలుసుకొని స్పాట్కు చేరుకున్న NDRF, అగ్నిమాపక సిబ్బంది..సెల్లార్లోని నీటిని బయటకు తోడుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈనెల 19వ తేదీ తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితిలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దాదాపు నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అంటే మొత్తంగా రెండు అల్ప పీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ విభాగం.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమ క్రమంగా చలి తీవ్రత తగ్గుతోంది. శివరాత్రి పూర్తికాగానే చలి తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం విపరీతంగా ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో 30కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక మార్చి మొదటి వారం నుంచే ఈ సారి ఎండలు మరింత దంచి కొడతాయని అంచనా వేస్తున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్గా ఎన్నికైన గణేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం రెండు పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని కూనమనేని తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మేయర్ గణేష్ చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు డిమాండ్ చేశారు. తమకు నిజంగా ఓటేశారా.. గుడికి వచ్చి నిరూపించుకోవాలనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు. డబ్బులు ఎవరు ఇవ్వమన్నారంటూ తిరగబడ్డారు. మేము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సదరు అభ్యర్థి భర్త గతంలో ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. డబ్బులు అడుగుతున్న వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు కీలక బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి