117
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కుటుంబ పార్టీకి భజన చేయడం మినహా… దేశం కోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. కరోనా లాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు. మోదీ ఏం చేసినా వ్యతిరేకించాలనే అజెండాతో కాంగ్రెస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు.




Total views : 202980