132
ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణ పనులపై మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆదివాసీల సాంప్రదాయాలు, సంస్కృతి , వారి జాతి చరిత్ర ప్రతిబింబించేలా ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతం అయిన నేపథ్యంలో, మిగిలిన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీఓ , ఆలయ పూజారులు పాల్గొన్నారు.




Total views : 202964