113
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ కింద తమ ప్రభుత్వం రూ.21 వేల కోట్లను విడుదల చేసిందని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.




Total views : 202965