Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం

by Satya
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం . ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనులశాఖ రూపొందించింది. ఈ నెల 8 నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది. ఇకపై ఇసుక తవ్వకాలు, రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వం టన్ను ఇసుకను 475 రూపాయల చొప్పున విక్రయించింది. అందులో కాంట్రాక్టర్ చేపట్టే తవ్వకాలు, రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేయగా మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరేది. కానీ ఇక నుంచి 375 కాకుండా 88 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. పైగా ఆ సొమ్ము కూడా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది.అలాగే సీనరేజి చార్జీ కింద ప్రతి టన్నుకు వసూలు చేసే 66 రూపాయలు జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు అందనుంది.

జిల్లా ఖనిజ నిధి కింద 19 రూపాయల 80 పైసలు చొప్పున వసూలయ్యే మొత్తం ఇసుక రీచ్‌ ల అభివృద్ధికి జిల్లా ఖాతాలో జమ కానుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూపాయి 32 పైసలు గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్‌ ఖాతాలోకి వెళ్లనుంది. మొత్తంగా చూస్తే నూతన విధానంలో ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుపై 287 ఆర్థికభారం తగ్గనుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్‌ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్‌ పాయింట్‌లో లోడింగ్‌ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్‌ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.