ఉక్రెయిన్ మాజీ మిలటరీ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిటన్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ జలుజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నానని జలుజ్నీ వ్యాఖ్యానించారు. తాజా సంక్షోభంలో రష్యా మిత్రపక్షాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు.
ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్పై పోరాడుతున్నారని, ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఇక్కడితో ఆపడం సాధ్యమేనని… కానీ కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్కు అనేకమంది శత్రువులు ఉన్నట్లు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి