Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

by Rama
సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు. అయితే దీనికి ఎక్కువగా మొబైల్స్ చోరీకి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వాళ్లే.. CEIR లో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఫోన్ పోయిన వెంటనే CEIR లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ ట్రేస్ అవుతుందని…అప్పుడు ఫోన్ ఎక్కడ ఉందనేది సులభంగా పట్టుకోగలుగుతున్నామని డీసీపీ తెలిపారు. ఈ సంవత్సరంలో నాల్గవ సారి మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలోని 45 పోలీస్ స్టేషన్ల పరిధిలో అందరూ కష్టపడటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 7500 ఫోన్లు రికవరీ చేశామి.. ఈ సంవత్సరం 5వేల 5వందల ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ నర్సింహా సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.