సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు. అయితే దీనికి ఎక్కువగా మొబైల్స్ చోరీకి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వాళ్లే.. CEIR లో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఫోన్ పోయిన వెంటనే CEIR లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ ట్రేస్ అవుతుందని…అప్పుడు ఫోన్ ఎక్కడ ఉందనేది సులభంగా పట్టుకోగలుగుతున్నామని డీసీపీ తెలిపారు. ఈ సంవత్సరంలో నాల్గవ సారి మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలోని 45 పోలీస్ స్టేషన్ల పరిధిలో అందరూ కష్టపడటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 7500 ఫోన్లు రికవరీ చేశామి.. ఈ సంవత్సరం 5వేల 5వందల ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ నర్సింహా సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి