Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Latest News అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు…

by CVR NEWS

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమని, ఆ రాత్రి నేడే కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 విమాన సిబ్బందిలో రెండో వ్యక్తిని విజయవంతంగా రక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌ను ‘దుష్టశక్తి’గా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలను పునరుద్ఘాటించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ‘చారిత్రాత్మకం’గా అభివర్ణించిన ట్రంప్, అమెరికా సైన్యం ఏ ఒక్క అమెరికన్‌ను వెనుక వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నాయని, వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది మంది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా, వారిని తప్పుదోవ పట్టించేందుకు సైనికుడు వేరే ప్రాంతంలో ఉన్నాడనే భ్రమ కల్పించి ఈ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. దాదాపు 48 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా ఆ ‘వీర సైనికుడు’ తప్పించుకు తిరిగాడని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, రక్తం కారుతున్నా ఆ సైనికుడు కొండచరియలు ఎక్కి తన లొకేషన్‌ను చేరవేశాడని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అనంతరం వెనుక వదిలేసిన తమ విమానాల్లోని సాంకేతికత ఇరాన్‌కు చిక్కకుండా ఉండేందుకు, వాటిని పూర్తిగా పేల్చివేసినట్టు ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు.

Advertisements

You may also like

Our Visitor

007282
Total views : 47769

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.