Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువు

ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువు

by Rama
ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువు

నిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ చెరువుకు అత్యంత పురాతనమైన చెరువుగా పేరుంది.
జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పక్షుల ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి వలస పక్షులు ఈ ప్రాంతానికి వలసకు వస్తాయి.
రాష్ట్ర అటవీ శాఖ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ట్రెక్కింగ్, బర్డ్స్ ఫెస్టివల్, నేచర్ క్యాంపు, సఫారీలను నిర్వహించింది. జిల్లాలోని ప్రకృతి అందాలను ప్రజలకు తెలిసేలా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో బాగుందని.. పర్యావరణ ప్రేమికులు, ఎన్జీవో సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.