270
కడప జిల్లా.. జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. దీంతో పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 74852