Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వసంత కృష్ణ ప్రసాద్..

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వసంత కృష్ణ ప్రసాద్..

by Satya
Vasantha Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా(NTR district), మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(MLA Vasantha Krishna Prasad) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో దూసుకుపోతున్నారు. ఆయనకు అడుగడుగున మహిళలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో వన్స్ మోర్ వసంత అడిమో సాంగ్ రిలీజ్ చేసారు వసంత కృష్ణ ప్రసాద్.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా పలువురు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రచారరధంపై నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్..చిన్ని, అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి తనకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.