Monday, March 16, 2026
News Navigation

Breaking

Monday, March 16, 2026
Home Andhra Pradesh విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

by Rama
విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 64 మంది కార్పొరేటర్లు ఉన్న నగర పాలికలో మేయర్ పీఠానికి 33 మంది సభ్యుల మద్ధతు ఉండాలి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో ఏడుగురు వెళ్లిపోతే మేయర్ కుర్చీ ఆ పార్టీకి దూరమైపోయినట్టే. ఇప్పటికే టీడీపీలో ఐదుగురు, జనసేనలో నలుగురు, బీజేపీలో ఇద్దరు చేరిపోయారు. మొత్తం 11 మంది కార్పొరేటర్లు వైసీపీకి దూరమైపోయారు. మరో పది మంది కూటమి పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం
    శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు భృంగి వాహన…
  • తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది.
    తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ…
  • తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
    తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
  • ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది.
    ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ‍ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ‍ప్రజలే. అయితే ఈ యుద్దం…
  • నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
    నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.