Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Devotional రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..

రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..

by CVR NEWS

రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం అర్చక బృందం స్వాగతం పలికిన అనంతరం, వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో శ్రీ వీకే శీనా నాయక్ కలిసి అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం, హరిజవహర్ లాల్ దంపతులు దేవస్థాన అన్నప్రసాద వితరణ కేంద్రానికి చేరుకున్నారు. భక్తులతో కలిసి కూర్చుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదం యొక్క రుచి, నాణ్యత మరియు వడ్డన తీరుపై స్వయంగా భక్తులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం పై వారు హర్షం వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం స్వీకరిస్తున్న వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు, పురుషుల పేరు వివరాలను డాక్టర్ హరిజవహర్ లాల్ అడిగి సంతృప్తి స్థాయి తెలుసుకున్నారు.అన్నప్రసాదశాల పరిశీలన అనంతరం, ఆలయ ఈవో మరియు చైర్మన్లకు హరిజవహర్ లాల్ పలు కీలక సూచనలు చేశారు. అన్నప్రసాద వితరణ జరిగే ప్రాంతంలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని, వంటశాలలో నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. వంటల తయారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, తాజా కూరగాయలు మరియు నాణ్యమైన దినుసులను మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. వంటశాలలో పనిభారాన్ని తగ్గించి, నాణ్యతను పెంచేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగించాలని సూచించారు.అన్న ప్రసాదం స్వీకరించే భక్తుల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు పరిశీలన చేయాలని ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

014995
Total views : 81448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.