Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News ఏప్రిల్ 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

ఏప్రిల్ 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

by CVR NEWS

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. అక్షయ తృతీయ పర్వదినాన ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతోంది. లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అడుగడుగునా నిఘా, పకడ్బందీ వసతులు కల్పిస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తూనే.. ప్రత్యేక దర్శనాల కోసం టిక్కెట్ల ధరలను ఖరారు చేశారు. 300, 1000 మరియు 1500 రూపాయల ధరలతో ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. మౌలిక వసతులు, వైద్య సేవలు మరియు నిరంతర రవాణా సౌకర్యాలను సిద్ధం చేశారు. రేపు జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో.. ఏర్పాట్లపై తుది మెరుగులు దిద్దనున్నారు. భక్తి పారవశ్యంలో మునిగిపోనున్న సింహగిరిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు.

Advertisements

You may also like

Our Visitor

014991
Total views : 81441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.