Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra Pradesh అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్

అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్

by Rama
అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి . మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే .. మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత హ హడావిడి అంత ఇంతా కాదు. తాను కార్ సర్వీసింగ్ కి వచ్చిన సమయంలో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసుల మీద కోపం తో హైవే ఫై ధర్నాకు దిగింది . అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్ తో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని నచ్చచెప్పడానికి వచ్చిన పోలీసుల ఫై ఆమె వాగ్వాదానికి దిగింది. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనవద్దకు రావాలి అని నిరసనకు దిగింది. దేనితో తన డిమాండ్ ను తీర్చలేక ప్రయాణికులకు ఇబ్బంది కలగ కూడదు అని పోలీసులు అఘోరీమాతను తాళ్లతో బందించారు.

ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా .. ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకువచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కొంతమందికి అఘోరాలు అంటే భయం.. భక్తి. కానీ ఈ అఘోరిని చూస్తే మాత్రం పూర్తిగా ఈమె రూట్ సెపరేట్. ఈమె ఎక్కడికి వెళ్లిన పోలీసులతో నానా హంగామా చేస్తుంది .ఈమె దారికి అడ్డొస్తే శాపనార్దాలతో చెమటలు పట్టిస్తుంది .
ఇంతకీ ఆఘోరీమాత హడావిడి అంత దేని కోసం ? సనాతన ధర్మ కోసమా ? దర్మం పేరుతో న్యూసెన్స్ చేయడమా ? అంత ఖరీదయిన కార్లు ఎక్కడివి తనకి ? పబ్లిసిటీ కోసమా ? ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా ? ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రజలను సందిగ్ధం లో పడేస్తుంది ఈ అఘోరి మాత

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

005705
Total views : 38419

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.