Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి

అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి

by Rama
DSP Srinivasulu Rao

తిరుపతి జిల్లా పిచ్చాటూరు అరనియర్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ వల్ల సత్యవేడు నియోజకవర్గంలో నారాయణవనం, పిచ్చాటూరు, కె వి బి పురం మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి అన్నారు. రాత్రి కురిసిన వర్షానికి అరనియార్ ప్రాజెక్ట్ కు వరద నీరు ఎక్కువ కావడంతో అరనియర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అరనియార్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అరుణానది దాటే ప్రయత్నం చేయరాదని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నీటిని కిందికి విడుదల చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరనియార్ అధికారులకు సూచించారు. ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల నారాయణవనం మండలం పాలమంగళం ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునగడంతో సుమారు వంద కుటుంబాలకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025907
Total views : 149478

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.