పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, అయోధ్య రామ మందర విరాళాల వివాదం, పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. అయితే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాం రచిస్తోంది. అలాగే మరో కొత్త 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు 2026, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026, జనన, మరణాల నమోదు సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే బిల్లు 2026, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026లు ఉండే అవకాశం ఉంది.
National
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ చెందిన రెబల్ ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కి సమావేశానికి ఆహ్వానం ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు సమావేశం నుంచి ప్రతీకాత్మకంగా వాక్ అవుట్ చేశాయి. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశానికి హాజరయ్యాయి. టీఎంసీకి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్లో ఎన్సీపీఐలో విలీనం అయినట్లు ప్రకటించారు. అయితే ఆ విలీనాన్ని లోక్సభ స్పీకర్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినప్పటికీ ఎన్సీపీఐని అఖిలపక్ష సమావేశానికి పిలవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ వెబ్సైట్లో కూడా పేరు లేని, అధికారిక గుర్తింపు లేని పార్టీని ఎలా సమావేశానికి పిలుస్తారు? అని ప్రశ్నించారు. మరోవైపు.. ఎన్సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ మాత్రం తమకు సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్కు అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తామని, విలీనానికి సంబంధించిన నిర్ణయం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీట్ పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్లో ఈ20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి అంశాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్సీపీఐకి ఇచ్చిన గుర్తింపుపై మొదలైన వివాదం.. పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికార–విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్బరస్ట్తో వరదలు ఉద్ధృతంగా ప్రవహించి అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి విషమించడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
రాజౌరీ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు క్లౌడ్బరస్ట్ సంభవించి భారీ వరదలు వెల్లువెత్తాయి. వరద ఉధృతికి వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగిపోగా, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరదల ధాటికి రాజౌరీలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బేలా బస్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోవడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది.
అప్రమత్తమైన అధికారులు వెంటనే రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 11:30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.
స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీంగా తయారు చేసిన పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’..అంతరిక్ష ప్రయోగాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే భారత గడ్డ పైనుంచి ఒక ప్రైవేట్ కంపెనీ పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్ను ప్రయోగిస్తుండటం ఇదే మొదటిసారి. ఇది సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలో మీటర్ల ఎత్తులోని లో-ఎర్త్ ఆర్బిట్లోకి చేరవేయగలదు. ఈ మిషన్లో ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ స్టార్టప్ ‘కాస్మోసర్వ్ స్పేస్’ తయారు చేసిన స్పేస్ జంక్ను తొలగించే ‘మిషన్ ఎంబ్రేస్’ రోబోటిక్ ఆర్మ్ పేలోడ్ను కూడా ఇది మోసుకెళ్లనుంది. ఇందులో కొన్ని విదేశీ ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లనుంది.
ప్రఖ్యాత మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టివాడ రూపొందించిన 18 క్యారెట్ల బంగారు మైక్రో రాకెట్ కూడా ఇందులో అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ చిన్న రాకెట్లో భారతీయ శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల మైక్రో ఆర్ట్లను ఉంచి గౌరవంగా పంపుతున్నారు. ఇందులో మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు చేతితో రాసిన పోస్ట్కార్డులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు.
చైన్నైకు చెందిన మరో అంతరిక్ష స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ కూడా అంతరిక్ష రంగంలో అద్భుతం చేయనుంది. తమ ‘మిషన్-ఓ2’ ద్వారా భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఆర్బిటల్-క్లాస్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా సముద్రంలోకి దించి, దానిని రికవరీ చేసే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ మిషన్ మరో ప్రత్యేకత ఏంటంటే ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ పైభాగం స్పేస్ జంక్గా మారిపోకుండా, అక్కడే ఒక పని చేసే లైవ్ ప్లాట్ఫారమ్గా మారి ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. కాగా… ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో అగ్నికుల్ కాస్మోస్ సంస్థ తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ను అబ్జర్వర్గా చేర్చుకుంది.
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు.
జింద్- సోనిపత్ మధ్య రెండు ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ.సామర్థ్యంతో నడుస్తుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లతో సహా మొత్తం 10 కోచ్లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్లు మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉండగా.. ఇంత పొడవైన రైలు ఎక్కడా లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న దేశంగా భారత్ నిలవనుంది. రైల్వే రంగంలో ఇది సరికొత్త విప్లవంగా చెప్పవచ్చు.
ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్లో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ తొలి కార్యక్రమం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జరగనుంది. జింద్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు..అక్కడి నుంచి దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. జింద్-సోనిపట్ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటివరకు హైడ్రోజన్ రైళ్లు లేవు. ఇదే తొలి ట్రైన్. స్వదేశీ టెక్నాలజీతో భారత్లోనే ఈ రైలును తయారుచేశారు. ఈ రైలు నుంచి ఎలాంటి హనికరమైన పొగ రిలీజ్ అవ్వదు. ఎలాంటి హానికరమైన పొగ రిలీజ్ అవదని..దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను తీసుకురానున్నట్టు చెబుతున్నారు.
ఇక ఈ పర్యటన సందర్భంగా కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. చండీగఢ్లో రూ.6,600 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనుండగా..PGIMERలో కొత్త కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ప్రెస్ హైవేను జాతికి అంకితం చేయనుండగా.. 75 అమృత్ సర్ భారత్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. మంగళగిరి, రాయనపాడుతో పాటు కంబం రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. అలాగే కర్టోలి–అంబాలా, అమృత్సర్ –వారణాసి మధ్య కొత్త రైలు సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
జింద్- సోనిపత్ మధ్య రెండు రౌండ్ ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ. వరకు సామర్థ్యంతో నడవనుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్లతో సహా మొత్తం 10 కోచ్లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్లు మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉండగా.. ఇంత పొడవైన రైలు ఎక్కడా లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న దేశంగా భారత్ నిలవనుంది. రైల్వే రంగంలో ఇది సరికొత్త విప్లవంగా చెప్పవచ్చు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వ వైద్యులతో రోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదేనని..ఆయన ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన వైద్యం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది.
59 ఏళ్ల సోనమ్ వాంగ్చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన మరో 48 గంటలు నిరాహార దీక్ష కొనసాగిస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైతే ద్రవరూపంలో పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు అందించాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్భంగా వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రభుత్వ వైద్యులు ఎందుకు పర్యవేక్షించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రోజూ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, అయితే కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు కూడా పరీక్షిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహతా తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇకపై ప్రభుత్వ వైద్యులతోనే రోజువారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే వెంటనే చికిత్స అందించాలని స్పష్టం చేసింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా గుర్తింపు పొందిన కామరాజర్ 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నైలోని మౌంట్ రోడ్డులో ఉన్న కామరాజర్ విగ్రహానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామరాజర్ దేశాభివృద్ధి, విద్యా రంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కామరాజర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు.
హిమాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే బ్రౌన్ బేర్లు మరోసారి కెమెరాకు చిక్కాయి.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.క్రిటికల్గా ఎండేంజర్డ్ జాతికి చెందిన ఈ బ్రౌన్ బేర్ల సంఖ్య ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. వీటి సహజ ఆవాసాలు క్రమంగా తగ్గిపోవడం, ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాల వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులు, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, మానవ జోక్యం పెరగడం వంటి కారణాలతో వన్యప్రాణుల జీవన విధానం తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్లో ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన ఎయిర్డ్రాప్ టెస్ట్లో పారాచూట్లు అనుకున్న విధంగానే పనిచేశాయి. డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించి విజయవంతంగా నేలకు చేర్చాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రూ క్యాప్సూల్ను సముద్రంలో సురక్షితంగా దించేందుకు ఈ 10 పారాచూట్ల వ్యవస్థ అత్యంత కీలకమని ఇస్రో తెలిపింది. ఈ విజయంతో గగన్యాన్ మిషన్ సిద్ధతలో మరో కీలక ముందడుగు పడింది.





Total views : 219357