తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను కొట్టివేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు.. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు. మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ధర్మాసనం.
Devotional
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది. లోకళ్యాణార్ధం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం ఆది దంపతులకు వెండి రథోత్సవం నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం చేశారు. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద అన్నాన్ని రాశిగా పోసి.. ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించారు.. తర్వాత నవకాయ పిండివంటలతో మహానివేదన సమర్పించారు. కుంభోత్సవం నేపథ్యంలో ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సాయంత్రం రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పించారు. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహించారు. ఉత్సవం ముగిసిన తర్వాత భక్తులను అమ్మవారి భ్రమరాంబికా దేవి నిజరూప దర్శనానికి అనుమతి ఇచ్చారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసం ఏటా ఛైత్రమాసంలో పౌర్ణమి తర్వాత నిర్వహించడం ఆనవాయితీ. కాగా ఈ కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవలను రద్దుచేశారు.కుంభోత్సవంలో ఆయా కైంకర్యాలన్నిటినీ ఆలయ ఈవో శ్రీనివాసరావు సూచనల మేరకు వైదిక కమిటీకి పరిపూర్ణంగా జరిపించాలని సూచించారు. క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షి బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీ వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథాన్ని కదిలించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రథాన్ని లాగారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇసుకవేస్తే రాలనంత భక్తులతో గోవింద నామస్కరణాలతో కదిరి పట్టణం మారుమోగింది. శ్రీవారికి దవనం, మిరియాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. దాతలు భక్తులకు ఉచిత అన్నదానం, త్రాగునీరు ఏర్పాటుచేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు,అల్పాహారాన్ని అందిస్తుండాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు, క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలని ముఖ్య భద్రత అధికారికి ఆదేశించారు. కాలిబాట మార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు అన్నదానం చేసే దాతలకు శ్రీశైల క్షేత్రం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. భక్తుల రద్దీ కనుకూలంగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంద సేవకుల సేవలు వినియోగించుకుంటూ అందరి సమన్వయంతో ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.
తిరుమలలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 6న ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆలయ వ్యవహారాలపై సమగ్ర అవగాహన పెంచుకున్నట్లు ఆయన తెలిపారు.సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలనలు నిర్వహిస్తానని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా, సౌకర్యవంతమైన దర్శనం అందేలా, అలాగే నాణ్యమైన ప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా టీటీడీ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
ఇవాళ ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి, గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట, మరియు వేములవాడ రాజన్న దేవాలయాల అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నేటి మధ్యాహ్నం నుంచే ఈ ప్రభావం మొదలుకానుండటంతో భక్తులు తమ పర్యటనలను తదనుగుణంగా మార్చుకోవాలని ఆలయ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి, పుణ్యాహవాచనం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో టి. బాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా తరలించడం, వైద్య, అగ్నిమాపక సహాయ చర్యలపై ఆక్టోపస్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి చర్చించారు.ఈ మాక్ డ్రిల్ కేవలం భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకేనని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ సీఎస్ఓ, ఏఈఓ, మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తుల రక్షణే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
రుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి, క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే 68 వేల 156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 28 వేల 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.46 కోట్లుగా నమోదైంది. దర్శన సమయం 10-12 గంటల నుంచి ఒక్కసారిగా 20 గంటలకు చేరడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు, రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం లో విదేశీ భక్తుల సందడి నెలకొంది. జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన సుమారు 170 మంది భక్తుల బృందం స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంది.జర్మనీ దేశానికి చెందిన శ్రీ పీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ పరమహంస విశ్వనాథ గురూజీ నేతృత్వంలో భక్తులు కాణిపాకం చేరుకున్నారు. ఆలయానికి విచ్చేసిన విదేశీ భక్తులకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, ఈవో శ్రీ పెంచల్ కిషోర్ గారు భక్తులను ఆత్మీయంగా పలకరించారు. విదేశీ భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వైభవం, నిర్వహణపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం,నాగవల్లి,ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం ప్రకారం మెట్టెలు,నల్లపూసలను సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజావరోహణ నిర్వహించారు. ఇవాల్టితో జరిగే అశ్వవాహనం పుష్పోత్సవం,శయణోత్సవం,శ్రీస్వామి అమ్మవారి ఏకాంతసేవతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి .