ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ తృతీయ రోజునే తెరుచుకున్నాయి. భద్రీనాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు. హిందూవులు సందర్శించే తీర్ధయాత్రల్లో బద్రీనాథ్ యాత్ర ఒకటి. ఇది ప్రధానంగా విష్ణు భక్తులచే నిర్వహించబడుతుంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో భద్రీనాథ్ ప్రముఖ పట్టణం.
సముద్రమట్టానికి మూడు వేల 133 మీటర్ల ఎత్తులో భద్రీనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ తీర్ధయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరలో లేదా మే నెల మొదటివారంలో ప్రారంభమవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయ్యింది. రెండు రోజుల క్రితం శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ లు సందడిగా మారాయి. తొలిరోజు ఒక్క భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి రికార్డు స్తాయిలో కేదార్ నాథ్ ధామ్ ను సందర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతిదేశంలో ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్లలో 2 వేల 853 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క గతేడాదిలోనే ఏకంగా 628 మంది గజరాజుల దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఓ సభ్యుడు అడిగిన…
- నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలునీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని…
- ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందివిద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్లో అత్యంత భారీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.