కడప జిల్లా(Kadapa District) జమ్మలమడుగు(Jammalamadugu)లోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి(Sri Narapura Venkateswara Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించింది. పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.