కడప జిల్లా(Kadapa District) జమ్మలమడుగు(Jammalamadugu)లోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి(Sri Narapura Venkateswara Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించింది. పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు… హైదరాబాద్కు ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు, ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు. సైబరాబాద్…
- దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను…
- మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 33661