కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు. నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది . ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్టిఏ ఎందుకు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కాంలో ఉంది. కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . లేటుగా వచ్చినందుకు గ్రెస్ మార్కులు ఇచ్చామని సిగ్గు లేకుండా సమర్ధించు కుంటున్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయి . 67 మంది టాపర్స్ గా నిలవడం అస్సలు ఎలా సాధ్యం అవుతుంది .
ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ మీద లేదా . ఎన్నికల టైం చూసుకుని ఎన్టిఏ టైం చూసుకుని ఫలితాలు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి మోది జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలి . నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్,చంద్రబాబు సమాధానం చెప్పాలి .బీజేపీ ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పేపర్ లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ప్రశ్నించారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి