కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పీసీసీ నేతలు. నీట్ పేపర్ లీక్ పై వైఎస్ షర్మిల విజయవాడలో ధర్నా లో మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించింది . ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్టిఏ ఎందుకు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కాంలో ఉంది. కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . లేటుగా వచ్చినందుకు గ్రెస్ మార్కులు ఇచ్చామని సిగ్గు లేకుండా సమర్ధించు కుంటున్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయి . 67 మంది టాపర్స్ గా నిలవడం అస్సలు ఎలా సాధ్యం అవుతుంది .
ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ మీద లేదా . ఎన్నికల టైం చూసుకుని ఎన్టిఏ టైం చూసుకుని ఫలితాలు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి మోది జపం మానేసి పేపర్ లీక్ ఘటనపై సమాధానం చెప్పాలి . నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్,చంద్రబాబు సమాధానం చెప్పాలి .బీజేపీ ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. పేపర్ లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ప్రశ్నించారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి