బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశా భోంస్లే కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. శనివారం గుండెపోటుతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె.. కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్లో లతా మంగేష్కర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన గాయని ఆశా భోంస్లే. లత చెల్లెలిగా సినీ పరిశ్రమకు పరిచయమైనా అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1933 సెప్టెంబర్ 8 న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. 1943 లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆశా… దాదాపు 60 ఏళ్ల కెరీర్లో ఆమె 12 వేలకు పైగా పాటలు పాడారు. ఏడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఆశా… పద్మ విభూషణ్తో పాటు దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు సైతం అందుకున్నారు.
Film
చెన్నైలో టీవీకే అధినేత విజయ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన “జన నాయగన్” సినిమా లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆన్లైన్లో లీక్ కావడం నిర్మాతలకు పెద్ద షాక్గా మారింది. తన రాజకీయ సభల్లో సినిమా విడుదలను డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ వచ్చిన విజయ్కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ లీక్ ఘటనపై చిత్రబృందం, అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా? ఒక కథ ఆ సమాజంలో అనుమానాల అగ్నిని రాజేస్తుందా? అంటే అక్షరాల పాకిస్థాన్లో అదే జరుగుతోంది .“దురంధర్” సినిమా రిలీజ్ తర్వాత అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరికి సందేహాలు, మనలో ఎవరైనా ఇండియన్ ఏజెంట్ ఉన్నాడా అనే అనుమానాలతో పాకిస్థానలో ఒక రకమైన మానసిక యుద్ధం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
దురంధర్ సినిమా.. ఒక గూఢచారి కథగా వచ్చినా పాకిస్థాన్లో అది భయానక వాస్తవంగా మారిందని చెబుతున్నారు.ఈ సినిమా చూసిన తర్వాత ఎవరినీ నమ్మలేకపోతున్నామంటూ అక్కడి ప్రముఖులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతాధికారుల వరకు“ఇతను ఇండియన్ ఏజెంట్ అయ్యుంటాడా?” అన్న అనుమానం కలిగిస్తోంది. అక్కడి వారిలో ఈ భయానికి కారణం సినిమాలో చూపించిన గూఢచారి నెట్వర్క్.దశాబ్దాలుగా పాకిస్థాన్లోనే జీవిస్తూ… భారత ఏజెంట్లుగా పనిచేస్తున్న వ్యక్తుల కథ అక్కడి ప్రజలను షాక్కు గురి చేస్తోంది. దీంతో రాజకీయ నేతలు, సైనిక వర్గాల్లో కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోతున్న పరిస్థితి తలెత్తింది. రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారం రేపింది.ప్రతిపక్ష, అధికార పార్టీలు ఒకరినొకరు “ఇండియన్ ఏజెంట్లు” అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు యుద్ధాలకే పరిమితమైన భారత్-పాక్ వైరం ఇప్పుడు “సైకలాజికల్ వార్” స్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే…ఈ సినిమాను పాకిస్థాన్లో అధికారికంగా బ్యాన్ చేసినా వివిధ మార్గాల్లో దాదాపు ప్రతి ఒక్కరూ చూశారు.ఇది కేవలం సినిమా ప్రభావం మాత్రమే కాదు.భారత్ సాధిస్తున్న దౌత్య, వ్యూహాత్మక విజయాలపై పాకిస్థాన్లో పెరుగుతున్న ఒత్తిడి కూడా కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ఇలా దురంధర్ సినిమా పాకిస్థాన్ లో ఇంతటి ప్రభావం చూపిస్తుందటే ఇది ఒక మానసిక యుద్ధం వంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను తిరిగి పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి ఆధునిక చిత్రాల వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సందేశాత్మక చిత్రాలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో గొప్ప మార్పులకు నాంది పలికాయని కొనియాడారు. అవార్డుల ఎంపికలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత పారదర్శకంగా విజేతలను నిష్పక్షపాతంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ వ్యక్తి కాదు వ్యవస్థ.. తెలంగాణ ఆటని, పాటని, ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప కళాకారుడని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, కళాకారులకు మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ బిర్యానీకే కాదు, దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావించినట్లు వివరించారు. సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వ్యవహరించారని గుర్తు చేశారు. సినీ కార్మిక పక్షపాతిగా నటుడు ప్రభాకర్ రెడ్డి గొప్ప పనులు చేసినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సౌత్ కొరియాలో తరహాలో సినిమాను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమా హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని వివరించారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఏఎన్నార్ అలాగే ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదిగిందన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా, తమ సర్కార్ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్ లో మిస్ ఇండియా లాంటి పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. అందుకే ప్రపంచంలోనే హైదరాబాద్, సేఫ్ సిటీ అని వెల్లడించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి తమ సర్కార్ అండగా ఉంటుందన్నారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర ప్రచారం, వ్యక్తిగత దూషణలపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్తో వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో అదుపుతప్పి ప్రవర్తించే వారికి ఈ సంఘటన గట్టి హెచ్చరిక. రేణు దేశాయ్ అందించిన అధికారిక ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీ సాయంతో అసభ్యకర పోస్టులు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరించారు. ఆ అకౌంట్ల ఆధారంగా నిందితుల ఆచూకీని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఎవరినైనా దూషించవచ్చని భావించే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ నెల 19న వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఏపీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. బ్లాక్బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సినిమా సందడి మొదలైంది. ఏపీలోని పలు సినిమా హాళ్లు నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్ను తెరుస్తున్నాయి. ఇందులో బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. త్వరలోనే అన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశారు. నేడు హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సంతోషం’ చిత్ర దర్శకుడు దశరథ్ స్క్రీన్ప్లే అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు తీపికబురు అందించింది. ఇకపై థియేటర్కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు వసూలుకు ఆస్కారం కలిగించే జీవో నెంబర్ 121ను హైకోర్టు కొట్టేసింది. సాధారణంగా మనం ఏదైనా మాల్స్, మల్టీప్లెక్స్లకు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.దీంతో అక్కడ సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ప్రత్యేక పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఇటీవల దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్లో ఓ ప్రేక్షకుడి నుంచి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. దీనిపై ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ కొంటే పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. ఈ తీర్పు కేవలం కోణార్క్ థియేటర్కు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని తెలిపింది. కోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి.
టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన అంటే సరిగ్గా వారం కిందట ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఉదయపూర్ లో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఒకటయ్యారు. వీళ్ళ వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయపూర్ లో జరిగిన పెళ్లి వేడుకకు కొంత మంది సన్నిహితులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ జంట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇక హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరోలు వచ్చారు.
విజయ్ దేవరకొండ , రష్మిక వివాహం జరిగి దాదాపు వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల పాటు రకరకాల పెళ్లి కార్యక్రమాల నేపథ్యంలో కొత్త జంట నలిగిపోయింది. కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పెళ్లి కార్యక్రమంలో పాల్గొంది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం… పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే పెళ్లి రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశారు. పెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి… ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు. అండర్ గ్రౌండ్ లోనే రిలాక్స్ అవుతామని వెల్లడించాడు. దీంతో విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.



Total views : 38420