రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎసిబి వలకు చిక్కాడు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి అడిగాడు. ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు రూపాయలు ఇవ్వలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు.లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన కలెక్టర్. బాధితుడు కారులో డబ్బులు తీసుకొని మధుమోహన్ రెడ్డికి ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఎసిబికి సీనియర్ అసిస్టెంట్ చెప్పాడు. ఎసిబి అధికారుల తమ ముందే జాయింట్ కలెక్టర్ కు మధుమోహన్ రెడ్డి చేత ఫోన్ చేయించారు. పెద్ద అంబర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని మధు మోహన్ రెడ్డికి జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పారు. పెద్ద అంబర్ పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి