Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshGuntur పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

by Rama
పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది. మహిళా హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారం రోజుల క్రితం భోజనంలో కాళ్లజెర్రి వచ్చిందని విద్యార్థినిలు ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం భోజనంలో కప్ప వచ్చిందని.. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు వరసగా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వారు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్‌ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. విచారణ నివేదికను వెంటనే ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023030
Total views : 140759

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.