నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కారులోనే పర్యటిస్తున్నారు. తద్వారా సమాజానికి పర్యావరణ హిత ప్రయాణంపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. ఈనెల 19వ తేదీన తుమ్మలపెంటలో నిర్వహించనున్న అత్యంత ప్రతిష్టాత్మక ‘మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలతో స్వయంగా ముఖాముఖి మాట్లాడుతు, వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, ఆర్థిక అండపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవగాహన కల్పిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..
21
previous post





Total views : 77212