మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి చోరీకి దొంగ ప్రయత్నించడం కలకలం రేపింది. బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో ఓ డూప్లెక్స్ ఇంట్లోకి చొరబడేందుకు గుర్తుతెలియని దుండగుడు ప్రయత్నించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు దొంగ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.అయితే అదే సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు ఉండటంతో దుండగుడి ప్రయత్నం బెడిసికొట్టింది. తలుపు పగలగొట్టేందుకు దొంగ ప్రయత్నిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే గట్టిగా అరవడంతో దుండగుడు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.కుటుంబసభ్యులు బయటకు వచ్చేలోపే దొంగ గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడేందుకు దొంగలు ప్రయత్నిస్తుండటంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి చోరీకి యత్నం.
25
previous post