నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామం లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramireddy) గారి సతీమణి కాటసాని జయమ్మ కోడలు కాటసాని మేధాశ్రీ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని జయమ్మ కాటసాని మేధా శ్రీ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడే నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బనగానపల్లె నియోజకవర్గం లో కాటసాని రామిరెడ్డి అని తెలిపారు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడం జరిగిందని మరింత అభివృద్ధి జరగాలంటే మే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజున బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారికి నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి తాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
- ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్కు విస్తృత ఏర్పాట్లు.ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…