నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామం లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramireddy) గారి సతీమణి కాటసాని జయమ్మ కోడలు కాటసాని మేధాశ్రీ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని జయమ్మ కాటసాని మేధా శ్రీ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడే నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బనగానపల్లె నియోజకవర్గం లో కాటసాని రామిరెడ్డి అని తెలిపారు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడం జరిగిందని మరింత అభివృద్ధి జరగాలంటే మే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజున బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారికి నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి తాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…