మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు పున ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కోటి 75 లక్షల విలువైన (షూస్) బూట్లను 53,000 మంది విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండ్ (బాటా) కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తున్నామని అంతేగాక విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎల్ఈడి టీవీలను మరియు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత విద్యాధిరుల ప్రోత్సాహంతో పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ మొదలు పెట్టలేదని తాను మాత్రమే నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది పలికిన జడ్చర్ల MLA , వారి భవిష్యత్తు కోసం చేయడం జరుగుతుందని ఇది ఇంతటితో ఆగిపోకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 38444