Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Political తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

by Prakash
తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను పవన్ పరిశీలిస్తారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన పవన్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.