Saturday, April 25, 2026
News Navigation
Saturday, April 25, 2026
News Navigation

Breaking

Saturday, April 25, 2026
Home Andhra Pradesh కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన

కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన

by Rama
కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన

అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతిపనిలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని, అందులో ఎలాంటి రాజీలేదని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో, పట్టణంలో 55 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు గురువారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 2వ వార్డు ఉర్దూస్కూల్ వద్ద 15.29 లక్షలతో సిసి రోడ్డు, 25వ వార్డు గాయత్రీ నగర్ లో 25.17లక్షలతో డ్రైనేజీ కాలువ, 32వ వార్డు చైతన్య విద్యాలయం వెనుక 14.53 లక్షలతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణాల పనులను ఆయన ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పనులు నాణ్యతగా చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇకనుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూనే ఉంటాయని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని నాగేశ్వరరావు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
    అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
    సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
  • కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
  • భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..
    భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై…
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
    ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

008167
Total views : 53919

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.