అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతిపనిలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని, అందులో ఎలాంటి రాజీలేదని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో, పట్టణంలో 55 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు గురువారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 2వ వార్డు ఉర్దూస్కూల్ వద్ద 15.29 లక్షలతో సిసి రోడ్డు, 25వ వార్డు గాయత్రీ నగర్ లో 25.17లక్షలతో డ్రైనేజీ కాలువ, 32వ వార్డు చైతన్య విద్యాలయం వెనుక 14.53 లక్షలతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణాల పనులను ఆయన ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పనులు నాణ్యతగా చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇకనుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూనే ఉంటాయని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని నాగేశ్వరరావు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
- ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలుఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ…
- టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్రTTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర. ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర..ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి