సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారని… త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
- తెలంగాణకు అలర్ట్. జూన్ 19 నుంచి భారీ వర్షాలు.భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి వారం రోజుల పాటు…
- చదువుతోనే సామాజిక ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయి.చదువుతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో…





Total views : 144651