రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఏసీఎస్ నుంచి కూడా పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రుణమాఫీ చేయడానికి పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్ల కోసం…
- చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.చేనేత భారతదేశ గర్వకారణమని… ఆ కళను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం… చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి…
- అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తనపై నమోదైన కేసులు, గతంలో జరిగిన అరెస్టుల వ్యవహారంపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులతో ఇక మాట్లాడేది లేదని.. తనపై నమోదైన కేసులన్నింటినీ న్యాయస్థానాల్లోనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.